ములుగు: ఈనెల 14న రామప్పకు 35 మంది సుందరీమణులు: కలెక్టర్

75చూసినవారు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఈనెల 14న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే మహిళలు సందర్శించనున్నట్లు శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఆరోజు రామప్ప సందర్శనకు పర్యాటకులకు అనుమతి లేదన్నారు. సుమారు 35 మంది సుందరీమణులు దేవాలయాన్ని సందర్శించనున్నారని, 3 గంటల పాటు రామప్పలో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా పర్యాటకులకు ఎలాంటి అనుమతి ఉండదని, పర్యాటకులు గమనించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్