ములుగు జిల్లా వాజేడులో మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన గ్రేహౌండ్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ మృతి చెందాడు. కాగా తొమ్మిది నెలల క్రితం శ్రీవాణితో శ్రీధర్కు వివాహం జరిగింది. దీంతో పాల్వంచ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా మృతిచెందిన పోలీసులకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి పోలీస్ హెడ్ క్వార్టర్స్కు తరలించారు.