అక్రమంగా తరలిస్తున్న నాటు సారాను పట్టుకున్నట్లు ఏటూరునాగారం ఎక్సైజ్ శాఖ సిఐ రామకృష్ణ గురువారం తెలిపారు. సీఐ వివరాల ప్రకారం. రాంనగర్ శివారులో అజ్మీర బద్రు అనే వ్యక్తి 5 లీటర్ల నాటు సారాను తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని వద్ద ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నవీన్, తిరుపతి, శ్రీనివాస్, వీరన్న, నాగరాజు పాల్గొన్నారు.