ఓ ఇంటర్ కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన వివరాలు. ములుగు జిల్లా మంగపేటకు చెందిన భవానీ హన్మకొండలోని వైబ్రంట్ అకాడమీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బుధవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందిందని, దీనికి కారణం కాలేజీ యాజమాన్యం అని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని గురువారం ఎంజీఎం మార్చురీకి పోలీసులు తరలించారు.