ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పేకాట, కోడిపందేలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని శనివారం తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నాన్-బెయిల్ నమోదు చేస్తామన్నారు. అలాంటివి జరుగుతున్నట్టు తెలిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పేకాట కోడిపందేలు ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని అన్నారు.