రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీల్లో ఏటూరు నాగారంకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారని కోచ్ ఎండీ హుస్సేన్ తెలిపారు. గతేడాది డిసెంబర్ 31 నుండి ఈనెల 2 వరకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కరాటే పోటీల్లో ఏటూరు నాగారంకు చెందిన ఐశ్వర్య, దినేశ్, హరిణి, హర్షవర్ధన్ ప్రతిభ కనబరచి పథకాలు సాధించారని శనివారం తెలియజేసారు.