మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి ప్రధాన రహదారిపై బుధవారం వెంకటాపురం సిఐ బండారి కుమార్, ఎస్సై హరీష్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనాలు, ప్రైవేటు వాహనాలను ఆపి వారి వివరాలను సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలను సేకరించి వదిలేశారు. ప్రత్యేకంగా కార్లు ఆపి వారి బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.