వెంకటాపూర్ (మండలంపాలంపేట గ్రామాన్ని టీబీ లెప్రసీ, ఎయిడ్స్, బ్లడ్ బ్యాంక్ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ పోరిక రవీందర్ సందర్శించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు. ఇంటి ఆవరణంలో టైర్లు, కొబ్బరి, బోండాలు, గోళాలు, సీసాల్లో వర్షపు నీరు నిలువ ఉంచరాదని సూచించారు. ములుగు జిల్లాను డెంగ్యూ, మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని అన్నారు.