వరంగల్ జిల్లా పాపయ్యపేట శివారు పదహారు చింతల్ లో తన ప్రేమను ఒప్పుకోలేదని ప్రియురాలి కుటుంబంపై గురువారం తెల్లవారుజామున తల్వార్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్, సుగుణ ఇద్దరు మృతి చెందారు. కుమారుడు మదన్, కూతురు దీపిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేకల బన్నీ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డట్టు బంధువుల ఆరోపించారు.