తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ నూతన పాలక మండలిను నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) నర్సంపేట ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడిగా మంగళవారం నియమించారు. ఈ నియామకం సందర్బంగా నర్సంపేట డిగ్రీ కళాశాలలో స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ మల్లం నవీన్ కు ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేసారు.