వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో, బస్టాండ్ ను వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను శుక్రవారం సందర్శించారు. ఆర్ఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా నర్సంపేటకు వచ్చిన విజయభానుకు ఆర్టీసీ డీఎం ప్రసూనలక్ష్మి, ఉద్యోగులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం డిపోలో ఆర్ఎం మొక్కను నాటారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.