అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య

80చూసినవారు
అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో ఓ గిరిజన మహిళ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో శుక్రవారం జరిగింది. గార్లగడ్డ తండాకు చెందిన ఫాల్తియ భద్రమ్మ రెండు రోజుల క్రితం పురుగు మందు తాగింది. వరంగల్ యంజియంలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె భర్త వీరన్న ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. పంటల సాగు కోసం రూ. 12లక్షల అప్పు చేయగా, వాటిని ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య కు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్