వరంగల్ జిల్లా ఖానాపురం మండల శివారు 365 జాతీయ రహదారి ఐనపల్లి వద్ద గురువారం కారు టైరు బ్లాస్ట్ కావడంతో అదుపు తప్పి కారు చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో అక్కడిక్కడే ఇద్దరు మృతి. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఖిలా వరంగల్ చెందిన వారిగా గుర్తించారు. మహబూబాబాద్ జిల్లాలోని కురవికి వెళ్లి వస్తుండగా ప్రమాదంజరిగింది.