అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు కేటాయిస్తామని వరంగల్ జిల్లా ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నన్నెబొయిన రమేష్ యాదవ్ అన్నారు. ఈర్యా తండాకి చెందిన గుగులోత్ రమాదేవి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లకు శుక్రవారం భూమి పూజ చేసి ముగ్గు పోశారు. ఈ కార్యక్రమంలో తాళ్ల పెళ్లి నర్సయ్య, మహిళ కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు బండి పద్మ తదితరులు పాల్గొన్నారు.