
ఐపీఎల్-2025 నిరవధిక వాయిదా
భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఐపీఎల్-2025ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. భద్రతా కారణాల దృష్ట్యా గురువారం ధర్మశాలలో జరిగిన పంజాబ్, దిల్లీ మ్యాచ్ను మధ్యలోనే నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత తిరిగి నిర్వహించే ఛాన్స్ ఉంది. కాగా ఐపీఎల్ లీగ్ దశలో భాగంగా ఇంకా 12 మ్యాచ్లున్నాయి.