వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దాత గా మహ పడిపూజ నిర్వహించారు. ఉదయం నుండి జరిగిన విశేష పూజల్లో ఎమ్మెల్యే, ఆయన కుమారుడు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి పడిపూజ ను తాంత్రిక పద్ధతి లో ప్రధాన పూజారి దేవాన్ష్ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆలయ ట్రస్టు సభ్యులు పలువురు పాల్గొన్నారు. అనంతరం మహ అన్నదానం ఏర్పాటు చేశారు.