వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరులో భూభారతి రెవెన్యూ సదస్సును నర్సంపేట ఆర్డీవో ఉమారాణి గురువారం సందర్శించారు. భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్డీవో రైతులకు సూచించారు. అనంతరం ఆమె దరఖాస్తుల ప్రక్రియ పరిశీలించారు. తహశీల్దార్ రాజేశ్వరరావు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.