సన్నరకం ధాన్యం కు బోనసు చెల్లిస్తామని ప్రభుత్వం సున్నం పెట్టిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో శుక్రవారం జరిగిన సమావే శంలో మాట్లాడుతూ ధాన్యం అమ్మి నెల రోజులైనా రైతు లకు బోనస్ అందలేదన్నారు. రైతు భరోసా ఎగవేతకు రేవం త్రెడ్డి ప్రభుత్వం కుట్ర చేసిందని దుయ్యబట్టారు. అన్నదాతకు పంట రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్ చెల్లించ డంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందన్నారు.