వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. నర్సింహులపేటకు చెందిన ముగ్గురు యువకులు ఈరోజు నర్సంపేటలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాదన్నపేట చెరువు మత్తడి వద్ద వారి కారు అదుపుతప్పి చెరువులో పడిపోయింది. దీంతో వెంటనే ఇద్దరిని కాపాడగా. మరో యువకుడు మృతి చెందాడు. పోలీసులు విచారణ చేపడుతున్నారు.