వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో గురువారం రైతులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రైతు రుణమాఫీని అమలు చేస్తున్నందున సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వరంగల్ డిక్లరేషన్ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సొసైటీ ఛైర్మన్, రైతులు ఉన్నారు.