వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని అశ్విని బిర్యానీ సెంటర్ లో వేయిటర్ గా పని చేసే చెన్నారావు పేట మండలం లింగగిరి గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు బిర్యాని సెంటర్లో పనిచేస్తూ ప్రతిరోజు అక్కడే నిద్రిస్తుండేవాడు. ఉదయం గేటు ముందు రక్తం మడుగులో పడి ఉండడానికి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.