వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ స్వచ్ఛంద సంస్థల సమాఖ్య అధ్వర్యంలో శుక్రవారం ఓటరు చైతన్య కార్యక్రమం నిర్వహించారు. నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్ జరిగిన ఈ కార్యక్రమం లో స్వచ్ఛంద సంస్థల సమాఖ్య సంఘాల బాధ్యుడు, ఏ. యస్. అర్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.