అప్పుల బాధతో క్షేత్ర సహాయకుడు మృతి

70చూసినవారు
అప్పుల బాధతో క్షేత్ర సహాయకుడు మృతి
అప్పుల బాధతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకుడు శ్రీనివాస్ మృతి చెందిన సంఘటన పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సె క్రాంతి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ (42) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్