వైకుంఠ ఏకాదశి వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏకాదశి రోజున విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల గట్టి నమ్మకం. కాగా మహావిష్ణువును దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి బయలుదేరే రోజే వైకుంఠ ఏకాదశిగా చెప్పుకుంటారు. పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.