బస్టాండులో ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పిస్తానని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు శుక్రవారం పాలకుర్తి బస్టాండును తనిఖీ చేశారు.
బస్టాండులో ప్రహరి నిర్మాణం, తాగునీటి సౌకర్యం లేదని ఎమ్మెల్యే దృష్టికి ప్రయాణికులు తీసుకొచ్చారు. అనంతరంఎమ్మెల్యే మాట్లాడుతూ బస్టాండ్ 38 ఏండ్ల క్రితం నిర్మించినా, వినియోగంలోకి రాలేదని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే బస్టాండును దాతల సహాయంతో వినియోగంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.