పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం, మైలారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పనిచేయాలని, గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్నారు.