అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లను జనగాం జిల్లా దేవరుప్పుల ఎస్సై సృజన్ కుమార్, పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన లో ఇద్దరి వ్యక్తులతో పాటు రెండు ట్రాక్టర్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సృజన్ కుమార్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.