మహబుబాబాద్ జిల్లా తొర్రూరులో ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై శనివారం రైతులు ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రాలకు తీసుకెళ్లిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షానికి వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయని వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవన్నారు. సమస్య లపై స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు.