కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని శనివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. శనివారం గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఎమ్మెల్యే దర్శించుకుని, ప్రత్యేక పూజలను నిర్వహించారు. దేవస్థానం సన్నిధిలో ప్రతి శనివారం నిర్వహించనున్న మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.