సంగెం లోని రైతు వేదిక వద్ద జరిగిన భూభారతి చట్టం -2025 అవగాహన సదస్సులో గురువారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యేరేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు కోలాటాలు, డప్పు చప్పులతో కలసి భూభారతి చట్టంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రైతులకు భూ భారతి చట్టం, విది విధానాలు వివరించారు. రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్ధమయ్యేలా సమాధానం ఇచ్చారు.