నడికూడ మండలం రాయపర్తి గ్రామంలో ఇటీవల మృతిచెందిన మారం కనిక రెడ్డి కుటుంబ సభ్యులను బుధవారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.