హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో పోలీసులు సీఐ క్రాంతి కుమార్ ఆదేశాల మేరకు ఎస్సై శివకృష్ణ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివకృష్ణ తన బృందంతో పలు వాహనాలు ఆపి తనిఖీలు నిర్వహించగా డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి జరిమానా విధించారు. అనంతరం ద్విచక్ర, త్రీచక్ర వాహనాలతో పాటు నాలుగు చక్రాల వాహనాలు ఆపి లైసెన్స్, ఆర్. సి, ఇన్సూరెన్స్ లు పరిశీలించి సరైన పత్రాలు లేని వారికి జరిమానా విధించారు.