ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు పరకాల నియోజకవర్గం నుండి వేలాదిగా పార్టీ శ్రేణులు తరలి రావాలని సోమవారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా పిలుపునిచ్చారు. ముందుగా డా. బీఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రజతోత్సవ మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరించి సమావేశాన్ని నిర్వహించారు.