గురువారం వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హన్మకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యతో మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రతి 3 నెలలకు ఒకసారి అప్ డేట్ కావాలని, నూతనంగా 18 సం. లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని అన్నారు. బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మార్చి 19లోపు సమావేశాలు నిర్వహించాలన్నారు.