హన్మకొండ జిల్లాలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సక్కపల్లిలో ట్రాలీ ఆటో బోల్తా పడి 15 మంది మహిళా కూలీలకు గాయాలు అయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 30 మంది కూలీలు ఉన్నారు. బాధితులంతా కమలాపూర్ మండలం గూడూరు వాసులుగా స్థానికులు గుర్తించారు.