హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామ శివారులోని హజ్రత్ సైలాని బాబా దర్గాలో ఈ నెల 21, 22 తేదీలలో జరిగే ఉర్సు ఉత్సవాలకు హాజరుకావాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని హనుమకొండలోని ఆయన నివాసంలో నిర్వాహణ కమిటీ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆమీర్ బాబా, అహ్మద్ బాబా, షేక్ మొయిన్, తదితరులు పాల్గొన్నారు.