పరకాలలో గంజాయి విక్రయిస్తూన్న ముగ్గురు వ్యక్తులను గురువారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. 3లక్షల 5వేల 900 రూపాయల విలువ గల 6కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరకాల, ఒడిషా, ఉత్తరప్రదేశ్ లకు చెందిన నిందితులు ఒడిషా గంజాయి తక్కువ ధరకు కొని పరకాల పట్టణంలో అధిక ధరకు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారని పరకాల సీఐ క్రాంతి కుమార్ తెలిపారు.