సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులను తరిమికొట్టాలంటే గోరువెచ్చని నీరు తాగాలని, ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకొని ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి తెలిపారు. గురువారం పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి ఆధ్వర్యంలో మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.