వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం పరకాల వ్యవసాయ మార్కెట్ లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎటువంటి కట్టింగ్ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు తెలియజేశారు. ఏ గ్రేడ్కు రూ. 2320, కామన్ రకానికి రూ. 2300 ధర చెల్లిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.