పరకాల: వయోవృద్ధుల సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ

57చూసినవారు
పరకాల: వయోవృద్ధుల సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా పరకాల వయోవృద్ధుల సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించబడింది. శుక్రవారం సాయంత్రం పరకాల అమరధామం నుండి బస్టాండ్ కూడలి మీదుగా నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 50 మంది వయోవృద్ధులు పాల్గొన్నారు. 'భారత సైనికులారా! మీ వెంటే మేముంటాం' 'అమర జవాన్లకు జోహార్లు' 'జై భారత్! జై జై భారత్! 'హిందుస్థాన్ జిందాబాద్' నినాదాలతో పరకాలపురవీధులలో ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్