భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి

81చూసినవారు
భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం గీసుగొండ మండలం కొనాయిమాకుల రైతు వేదిక వద్ద జరిగిన భూ భారతి అవగాహన సదస్సులో కలెక్టర్ సత్య శారద, అధికారులతో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు భూభారతి చట్ట అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ఆటపాటలతో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్