వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడేలతో కలసి ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటలో భూములు అందజేసిన రైతులకు నష్టపరిహారం చెల్లింపు పురోగతి, దామెర చెరువు సుందరీకరణ, పైడిపల్లిలో స్పోర్ట్ సిటీ ఏర్పాటు, నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ అభివృద్ధి, తదితర అంశాలపై శనివారం అధికారులతో సమీక్షించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి రైతులు అందించిన భూములకు ఇంకను పెండింగ్ లో ఉన్న పరిహారాన్ని వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు.