వరంగల్ జిల్లా వైద్యాధికారి డా. బి. సాంబశివరావు నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం హెచ్చరించారు. ఆస్పత్రులపై ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలోని క్లినికల్ అన్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు.