బెస్ట్ అవైలబుల్ పథకం కింద 2024-25 విద్యా సంవత్సరంలో కార్పొరేట్ పాఠశాలలో మూడు, ఐదు ఎనిమిది తరగతుల్లో ప్రవేశం పొందేందుకు గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సోమవారం ఒక ప్రకటన తెలిపారు. విద్యార్థులు జూన్ ఆరో తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలన్నారు. దరఖాస్తు ఫారాలు గిరిజన సంక్షేమ కార్యాలయంలో లభిస్తాయని తెలిపారు.