రాంపూర్ నుండి కాజీపేట వరకు ఆక్రమణలపై వరంగల్ బల్దియా అధికారులు దృష్టి సారించారు. పాదచారులు నడిచే నడకదారుల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు, దుకాణాలు సైన్ బోర్డులను తొలగించారు. బల్దియా కమిషనర్ అశ్విని తనాజీ వాకదే ఆదేశాల మేరకు శనివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణలను తొలగించారు. రోడ్లను ఆక్రమించి పెట్టిన హోర్డింగ్లు, బోర్డులు, షెడ్లు, డబ్బాలను పొక్లెయినర్ ద్వారా కూల్చేశారు.