సిటీ పోలీసు యాక్ట్ కింద బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 221 మందిపై కేసు నమోదు చేసినట్లు గురువారం సాయంత్రం సీపీ తెలిపారు. జనగామ డివిజన్లో 57, హనుమకొండ 42, స్టేషనఘన్పూర్ 40, కాజీపేట 24, వర్ధన్నపేట 24, నర్సంపేట 24, వరంగల్ లో 10 చొప్పున కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం షాప్ ముందు, పరిసరాల్లో ఎవరైనా మద్యం తాగితే షాప్ యజమానిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.