ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ప్ర
వేశపెట్టిన తీర్పును స్వాగతిస్తున్నామని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. వర్గీకరణతో ఎస్సీలకు విద్యా ఉద్యోగాల్లో మరిన్ని అవకాశాలు పెరుగుతాయని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు అధికారాలు కల్పించడం పట్ల ఎంపీ కావ్య హర్షం వ్యక్తం చేశారు.