జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు పుష్పగుచ్చమంచి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వర్గీకరణతో ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరుగుతుందన్నారు.