వరంగల్: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రజలు ప్రమాదాల బారినపడ్డారు

66చూసినవారు
వరంగల్: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రజలు ప్రమాదాల బారినపడ్డారు
జాతీయ రహదారి పై ప్రమాదాల నివారణతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు. బుధవారం జాతీయ రహదారి 163పై స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని 5గ్రామాలలో మంజూరు అయిన 5 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ల నిర్మాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేషనల్ హైవే అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలోపర్యటించి స్థల పరిశీలన చేశారు.