రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ చేసివున్న దిచక్ర వాహనాలే లక్ష్యంగా చొరీలకు పాల్పడుతున్న నిందితుడుని హసన్పర్తి పోలీసులు అరెస్టు చేసారు. నిందితుడి నుండి సుమారు 10లక్షల విలువ గల 18 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం ఏసీపీ తిర్మల్ తెలిపారు. చిలుపూర్ మండలం, ఫతేపూర్ కు చెందిన గుగులోత్ చందులాల్, స్నేహితుడి లాగిన్ ఐడీతో స్విగ్గీ, ర్యాపిడో సంస్థల్లో పనిచేస్తున్నాడు.